కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై, ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలపై మున్సిపల్ కమిషనర్ సొంటే రాజయ్య ఉక్కుపాదం మోపుతున్నారు. మొన్న ఎన్టీఆర్ చౌరస్తా లో అక్రమంగా నిర్మాణం చేసిన బిల్డింగ్ పై ఉక్కుపాదం మోపారు. తాజాగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వేసిన తడకలను మున్సిపల్ సిబ్బందితో తొలగించారు.
కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 11 వార్డు జమ్మెన్ గడ్డ పాత వాటర్ ట్యాంక్ వెనక భాగంలో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి కృష్ణ అనే వ్యక్తి తడకలతో షెడ్డు నిర్మించి కబ్జా చేశారు. దీనితో విషయం తెలుసుకున్న కొందరు మున్సిపల్ కమిషనర్ రాజయ్య పిర్యాదు చేశారు. కమిషనర్ తక్షణమే స్పందించారు. సోమవారం ఉదయం సిబ్బందిని పంపించి అక్రమంగా నిర్మించిన షెడ్డును తొలగించారు. ప్రభుత్వ స్థలాలను ఎవరూ అక్రమించుకోవాలని చూస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ సొంటే రాజయ్య హెచ్చరించారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్