వనపర్తి పట్టణంలో ఆర్టీసీ కార్గో రవాణా వాహనం ద్వారా సరఫరా చేసిన 360 కిలోల బెల్లాన్ని పట్టుకున్నామని ఆబ్కారీ ఇన్స్ పెక్టర్ సుభాష్ చందర్ రావు విలేకరులకు తెలిపారు.
ఈ బెల్లం వనపర్తి పట్టణానికి సంబంధించిన శ్రీ లక్ష్మీనరసింహ కిరాణా దుకాణం యజమాని చంద్రశేఖర్, శ్రీనివాస కిరాణా దుకాణం యజమాని కుమార్ ఇద్దరు కలిసి హైదరాబాద్ నుండి వనపర్తికి తెచ్చారని ఆయన తెలిపారు.
కుమార్ ను అరెస్ట్ చేశామని, చంద్రశేఖర్ పరారీలో ఉన్నాడని, అతని పై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. బెల్లాన్ని సీజ్ చేశామన్నారు.
బెల్లాన్ని వనపర్తి పట్టణానికి తీసుకొచ్చిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెల్లం వ్యాపారులు సారా తయారీకి అమ్మడం మానుకోకపోతే వారి మీద పీడీ చట్టం ప్రయోగిస్తామని ఆయన తెలిపారు.
ఈ దాడులలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణుడు ,బాలరాజు, బాన్నప్ప కానిస్టేబుల్ ఆంజనేయులు ,మన్యం ,రంజిత్, సురేష్ గౌడ్ ,రాజు ,రాధిక పాల్గొన్నారు.