ముంబై – జైపూర్ ఎక్స్ప్రెస్ రైలులో కాల్పులు కలకలం రేపాయి. రన్నింగ్ ట్రైన్లో కాల్పులు సంచలనం సృష్టించాయి. ఈ ఘటనలో ఏఎస్ఐ సహా నలుగురు మృతి చెందారు. మహారాష్ట్ర పాల్ ఘర్ స్టేషన్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. బీ 5 కోచ్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ కాల్పులకు పాల్పడ్డాడు.
కాల్పుల్లో ఏఎస్ఐ సహా నలుగురు మృతి చెందారు. కాల్పులు జరిపిన తర్వాత రైలు నుంచి నిందితుడు చేతన్ దూకేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.