33.2 C
Hyderabad
May 3, 2024 23: 26 PM
Slider కడప

ఇంటి నీటి కుళాయిలకు మీటర్లు బిగించడం సముచితం కాదు

#tdpkadapa

మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్టు నీటి మీటర్లు బిగించడం దారుణం అన్నారు. చెత్తపై పన్ను  నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే ప్రజల భాగస్వామ్యం తో ఆందోళనలు నిర్వహిస్తామని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహకులు గోవర్ధన్ రెడ్డి,హరిప్రసాద్,రాష్ట్ర ఉపాధి హామీ పథకం మాజీ సభ్యులు పోతుగంటి పీరయ్యా సంయుక్తంగా హెచ్చరించారు.

గత రెండేళ్లుగా కరోనా వ్యాప్తి తో ప్రజలు ఉపాధి లేక ఆదాయం లేక ఇంటిపట్టునే ఉండి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని,ఇవేమీ పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం ఇంటి పన్నులు, ఆస్తి పన్నుల భారం మోపుతున్నారన్నారు. కడప టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నాడు వారు మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని వారు విమర్శించారు. ఈ చర్యలు ఆపకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు.

Related posts

పెండింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయండి

Satyam NEWS

ఘనంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవం

Satyam NEWS

విషజ్వరాల నుంచి రక్షణ కోసం గిరిజనులకు దోమతెరల పంపిణీ

Satyam NEWS

Leave a Comment