32.2 C
Hyderabad
May 2, 2024 01: 19 AM
Slider ముఖ్యంశాలు

కార్యకర్తల్లో జోష్ నింపుతున్న కేటీఆర్

#KTR

కేటీఆర్ తీసుకొచ్చిన ఎన్నో విప్లవాత్మక సంస్కరణలతో తెలంగాణా అభివృద్ధి లో దేశానికే డిక్చూచిగా మారిందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. న్యూఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ స్వగృహంలో నామ నాగేశ్వరరావు, కే. కేశవరావు నేతృత్వంలో కేక్ కట్ చేసి, కేటీఆర్ జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి, ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుని, కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేటీఆర్ కార్యకర్తలకు , నాయకులకు అండగా ఉంటూ యువ నాయకుల్లో జోష్ నింపుతున్న డైనమిక్ లీడర్ అని కొనియాడారు. అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారని అన్నారు.

తన మేధస్సు తో యావత్ తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధిలో విశ్వ వ్యాప్తం చేసిన అపర భగీరథుడని అన్నారు. ఆయన కఠోర దీక్ష, పట్టుదల వల్లనే నేడు తెలంగాణా కు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని అన్నారు. ఐటీ శాఖా మంత్రిగా తనదైన శైలీలో అనేక నూతన ఆవిష్కరణలకు ఆద్యులయ్యారని కేశవరావు, నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో పార్టీ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, ఎంపీలు సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారధి రెడ్డి,దామోదర్ రావు , ప్రభాకర్ రెడ్డి, బేబీ పాటిల్, పోతుగంటి రాములు, దయాకర్, వెంకటేష్ నేత, మన్నే శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, రవిచంద్ర, మాలోత్ కవిత, తదితరులు ఉన్నారు.

Related posts

నర్సింగ్ కళాశాల పనులను వెంటనే పూర్తి చేయాలి

Satyam NEWS

భూకంపం: టర్కీ, సిరియాలో 4,500కి చేరిన మృతుల సంఖ్య

Bhavani

విజ‌య‌న‌గ‌రం రాజీవ్ స్టేడియంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే .!

Satyam NEWS

Leave a Comment