రాష్ట్రంలో ఘడియోకో అత్యాచారం.. పూటకో హత్య జరుగుతూ రాష్ట్రం నేరాంధ్ర ప్రదేశ్ గా జగన్ ప్రభుత్వం తయారు చేసిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. తాజాగా విజయనగరం లో జరిగిన రెండు ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ సంఘం ఆధ్వర్యంలో మహిళలు కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు.
మొన్న రేపల్లె, నిన్న గుంటూరు, తాజాగా విజయనగరం ఇలా వరుసగా దారుణాలు జరుగుతున్నాయన ఇందుకు ప్రభుత్వానిది బాధ్యత లేదా అంటూ ఐద్వా తరుపున మహిళలు ప్రశ్నించారు. రోజు కో ఘటన జరగడం తో అసలు పోలీసులు ఆ వ్యవస్థ ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈక్రమంలో వర్మ కమీషన్ ను రాష్ట్రంలో అమలు చేయాలని ఐద్వా డిమాండ్ చేసింది.