నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
కొల్లాపూర్ పట్టణంలో మే 6 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయని రాణి ఇందిరా దేవి ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్, పరీక్షల చీప్ సూపరింటెండెంట్ అధికారి మాధవరావు తెలిపారు.
ఈ పరీక్షలలో ఉదయం 8.00 లకే కి పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని 9.00 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలో నికి అనుమతించరని తెలిపారు. కొల్లాపూర్ పట్టణంలోని రాణి ఇందిరా దేవి జూనియర్ బాలుర కళాశాల లో సుమారు 372 విద్యార్థులు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల యందు సుమారు 400 విద్యార్థులు, గాయత్రి జూనియర్ కళాశాల లో సుమారు 340 విద్యార్థులు మహాదేవి జూనియర్ కళాశాలలో సుమారు 425 విద్యార్థులు ఇంటర్ పరీక్షలు వ్రాస్తున్నారు అని తెలిపారు.
పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్ లుగా వినయ్ కుమార్, రవీందర్, పద్మావతమ్మ. డిపార్ట్మెంటల్ ఆఫీసర్లుగా శ్యామ్, స్వర్ణలత, వెంకటేశ్వర్లు, కస్టోడియన్ లతీఫ్ విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్