30.2 C
Hyderabad
May 17, 2024 15: 34 PM
Slider నిజామాబాద్

ముఖ్యమంత్రి కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఖాయితీ లంబాడాలు

#Minister KCR

వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, మథుర ఖాయితీ లంబాడాలు, మాలి సహా బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలు, చమర్ మధురాలు, చుండువాల్లు, తలయారి కులాలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం ప్రకటించిన నేపథ్యంలో

ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన మథుర ఖాయితీ లంబాడాలు అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి ముఖ్యమంత్రి కేసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అధ్వర్యంలో వీరంతా మంత్రిని కలిసి పుష్ప గుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. ఏళ్ల తరబడి ఉన్న తమ సమస్యను గుర్తించి అసెంబ్లీలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ కి జీవితకాలం రుణపడి ఉంటామని అన్నారు. వీరంతా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలానికి చెందిన వారు.

Related posts

ఓటు హక్కు వినియోగం పై అవగాహన ర్యాలీ

Satyam NEWS

వర్క్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్ ని బదిలీ చేయండి

Satyam NEWS

రేవంత్ రెడ్డి పాదయాత్రలో వనపర్తి నాయకులు

Satyam NEWS

Leave a Comment