42.2 C
Hyderabad
April 26, 2024 17: 38 PM
Slider మహబూబ్ నగర్

రేవంత్ రెడ్డి పాదయాత్రలో వనపర్తి నాయకులు

#RaventhReddy

రాజీవ్ రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారంనాడు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆమనగల్ మీదుగా శ్రీశైలం హైవే ద్వారా కడ్తాల్ కు చేరింది. కడ్తాల్ మండల కేంద్రంలో చేపట్టిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై  విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నల్ల చట్టాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వత్తాసు పలుకుతూ మద్దతు పలకడం శోచనీయమని విమర్శించారు.

ఈ సందర్భంగా పాదయాత్రకు వనపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ సభ్యుడు వనపర్తి మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు వంశీధర్ రెడ్డి, ప్రముఖ రియల్టర్ భూపేందర్ సింగ్ సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

పారద‌ర్శ‌కంగా హెడ్ కానిస్టేబుల్ స్థాయి నుంచీ బ‌దిలీలు…  !

Satyam NEWS

50 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన హిందుస్థాన్ యూనీలీవ‌ర్‌

Satyam NEWS

వాయుకాలుష్యంపై ఐదు రాష్ట్రాలకు రెడ్ ఎలర్ట్

Satyam NEWS

Leave a Comment