ఓబీసి రిజర్వేషన్ల్ పితామహుడు బి పి మండల్ జయంతి వేడుకలు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయ ఆధికారి యు. గంగన్న మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల నుండి ఒక చదువుకున్న వ్యక్తి తను వచ్చిన సమాజం అభివృద్ధి గురించి నిస్వార్థంగా, నిబద్ధతతో పని చేస్తే ఏలాంటి మార్పు ఉంటుందో ఉదాహరణ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ అని అన్నారు.
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను పరిశీలించేందుకు కేంద్రం నియమించిన కమిషన్ కు బి పి మండల్ చైర్మన్ గా వ్యవహరించారని ఆయన తెలిపారు.
బిసిలకు అనుకూలంగా నివేదిక ఇచ్చిన గొప్ప వ్యక్తి మండల్ అని ఆయన అన్నారు. విద్యా ఉద్యోగ చట్ట సభల్లో ఆర్థిక రంగంలో న్యాయమైన వాటా పొందేందుకు బి.పి మండల్ సిఫార్సు చేశారు.
ఈ కార్యక్రమం లో ఆదిలాబాద్ జిల్లా స్వేరోస్ అధ్యక్షుడు పెంటపర్తి ఊశన్న, స్వేరోస్ జిల్లా కోశాధికారి కూర పోచ్చన్న, స్వేరోస్ జిల్లా నాయకులు నాగోరావ్ పాటిల్, సాయి వైకుంఠ ట్రస్ట్ డైరెక్టర్ నవీన్ యాదవ్, టియుటిఆఫ్ ప్రధాన కార్యదర్శి సాయిరి శ్రీకాంత్, గణేషం, దీలిప్ ,స్వేరోస్ తదితరులు పాల్గొన్నారు.