రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని తెల్లాపూర్ లో వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెల్లపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వరగారి రమణ తెలిపారు.పెరుగుతున్న కరోనా కట్టడికి టీకా వేసుకోవడమే మార్గమని భావించి తెలంగాణ ప్రభుత్వ సహకారం తో తాత్కాలిక వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకి,ఇక్కడికి వివిద ప్రాంతాల నుండి విచ్చేసే వలస కార్మికులకు టీకా వేయిస్తున్నామని అయన తెలిపారు .తమకు సహకరించిన అందరికి ఈ సందర్భంగా రమణ కృతజ్ఞతలు తెలిపారు.
previous post