అపారమైన మేధస్సుతో భారతదేశ కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగరవేసిన మహా గణిత శాస్త్రవేత్త శ్రీనివాసా రామానుజన్ అని ములుగు,భుపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. బుధవారం ములుగు బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ పాఠశాలలో శ్రీనివాసా రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యమానికి ముఖ్యతిధిగా తస్లీమా వెళ్ళారు. విద్యార్థులు వివిధ అంశాలలో ఏర్పాటు చేసిన గణిత శాస్త్రం ఫెయిర్ ప్రదర్శనను వీక్షించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి శ్రీనివాసా రామానుజన్ ను ఆదర్శంగా తీసుకొని నిత్య జీవితంలో గణితం పట్ల శ్రద్ధ వహించి భవిష్యత్తులో ఉన్నత విద్యకు పునాది వేసుకొని దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు కావాలని తస్లీమా అన్నారు. అనంతరం టాలెంట్ టెస్టుల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ పాల్ రజినీకాంత్, ఏ ఓ వెంకటరమణ,సెక్రెటరీ రాజేశ్వర్ రెడ్డి,ఉపాధ్యాయులు రాకేష్,పూర్ణందర్,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.