ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ లో స్మశాన వాటిక స్థలం కేటాయించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద బుధవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో జమ్మిగడ్డ కు చెందిన 20 కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్మశానవాటిక స్థలం కేటాయించాలని కోరుతూ ఎన్నో సంవత్సరాలుగా స్థానిక అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా కనీస స్పందన లేకపోవడంతో ఆందోళన ఉధృతం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎంపీ మల్లు రవి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోటకూర జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ జమ్మిగడ్డ స్మశానవాటిక కోసం సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్ రెడ్డి పోరాటానికి తమ వంతు అండదండలు అందజేసి జమ్మిగడ్డ వాసుల చిరకాల వాంఛ అయిన స్మశాన వాటిక ను సాధించడం కోసం అన్ని వేళల అండగా ఉంటామని ప్రకటించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా జమ్మిగడ్డ స్మశానవాటిక కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలియజేయమన్నారని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పద్మ, జమీలా బేగం, కాంగ్రెస్ పార్టీ ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజి రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సీతారాం రెడ్డి, బొజ్జ రాఘవ రెడ్డి గడ్డం యాదగిరి, కాసుల పోచయ్య గౌడ్, నీరుకొండ సతీష్ బాబు, ఎస్ కె రహీమ్, తాడూరి గగన్ కుమార్, తుమ్మల మధుకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గౌడవెల్లి బాల్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు గోగుల సరితా వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, సింగరేణి పోచయ్య, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి పేట శ్రీనివాస్, వేముల శ్రీనివాస్ రెడ్డి, యాష్కీ శంకర్ గౌడ్, కోలా కృష్ణ యాదవ్, మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, ముప్పా రామారావు, ముప్పు శ్రీనివాస్ రెడ్డి, తుంగతుర్తి రవి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జవహర్ నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి