30.2 C
Hyderabad
May 17, 2024 17: 35 PM
Slider మహబూబ్ నగర్

ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్: కల్వకుర్తి ఎమ్మెల్యే ఇంటిపై దాడి

jaipal yadav

సహకార ఎన్నికలు రాజకీయ చిచ్చు రగుల్చాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. చైర్మన్ పదవి కోసం టిఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. జూపల్లి భాస్కర్ రావు పట్ల ఎమ్మెల్యే మొగ్గు చూపడంతో సహనం కోల్పోయిన సంజీవ్ యాదవ్ వర్గం ఆయన ఇంటిపై దాడి చేసింది. ఎమ్మెల్యే జైపాల్ ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే జైపాల్ ఇంటి వద్ద టిఆర్ఎస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. కొందరు సంజీవ్ అనుచరులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Related posts

జులై 1న ఏవోబీ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

Satyam NEWS

నిరుపేదలైన దళితులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీలో లో కోదండరాం టీజేఎస్ విలీనం?

Satyam NEWS

Leave a Comment