సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు గురువారం ఎమ్మార్పీఎస్ టిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పడిదల రవికుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబు మాదిగ మాట్లాడుతూ దళితులు ఆత్మగౌరవంతో జీవించటానికి దళిత బంధు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు కానీ ఈ పథకం దళితుల ఆత్మగౌరవాన్ని స్థానిక ఎమ్మెల్యే ముందు తాకట్టు పెట్టబడిందని అన్నారు.
జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 3వ,తేదీన కలెక్టరేట్ దిగ్బంధ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు,ఇట్టి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేయటం జరిగినదని అన్నారు.ఈ కార్యక్రమానికి కో-ఆర్డినేటరుగా పిడపర్తి వేంకటనారాయణ,చెడపంగు సైదులు ను జిల్లా అధ్యక్షుడు నియమించటం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లెటి లక్ష్మణ్, జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు బచ్చలకూరి నాగరాజు,వి.హెచ్.పి.ఎస్.జిల్లా అధ్యక్షుడు కొమ్ము రామయ్య,రాష్ట్ర నాయకులు జానయ్య,దుబ్బా రమేష్, జిల్లా నాయకుడు జయరాజు,మండల నాయకులు కడప పెంటయ్య,మిద్దె వేంకటేశ్వర్లు,రెడపంగు నాగరాజు,కుక్కల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్