పార్టీ లో ఉటూగా తాగి మద్యం మత్తులో ఓ యువకుడు మంచంపై నుంచి పడి మృతిచెందిన ఘటన ఓ రిసార్ట్స్లో వెలుగుచూసింది. శామీర్పేట ఎస్సై భాస్కర్రావు కథనం ప్రకారం శామీర్పేట మండలం బొమ్మరాశిపేటలోని ఓ రిసా ర్ట్స్లో పని చేస్తున్న మిజోరాం రాష్ట్రానికి చెందిన లాల్ నుంచమ(23) కొంత కాలం క్రితం ఉపాదినిమిత్తం మేడ్చల్ జిల్లాకు వచ్చాడు.
మిత్రుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి మద్యం సేవించాడు. తనకు కేటాయించిన గదిలోని మంచం పై పడుకున్నాడు. తెల్లవారు జామున తోటి మిత్రుడు లాల్మాల్సౌమ లేచి చూడగా కింద పడి అపస్మారకస్థితిలో ఉన్నాడు. వెంటనే రిసార్ట్స్ సిబ్బంది శామీర్పేట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని 108 సిబ్బందికి సమాచారమివ్వగా వారు పరిశీలించి అప్పటే మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.