27.7 C
Hyderabad
May 17, 2024 22: 57 PM
Slider ఖమ్మం

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి

#National Lok Adalat

జూన్ 10 న జరగనున్న జాతీయ లోక్అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాలుల లో పోలీస్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు.

రాజీకాదగిన పెండింగ్ క్రిమినల్ కేసులు మరియు ఇ -పిటి కేసుల వివరాలను ఠాణాల వారిగ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అందరు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ సారి జరిగే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసులను పరిష్కరించడం ద్వారా జిల్లాను ఉన్నత స్థానంలో తీసుకురావడం కోసం పోలీస్ అధికారులు కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డి.ఎస్.పి రెహమాన్, ఎ పీపీ లు విశ్వశాంతి, లావణ్య కొత్తగూడెం కోర్టు పరిధిలో ఉన్న పోలీస్, ఎక్సయ్ జ్ అధికారులు, లైజన్ ఆఫీసర్ వీరబాబు,హరగోపాల్ కోర్టు కానిస్టేబుల్స్, న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు.

Related posts

కొత్త అసెంబ్లీ భవనం అవసరం లేదన్న హైకోర్టు

Satyam NEWS

ముంబయి ఆసుపత్రి అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి

Satyam NEWS

రోడ్డెక్కి ముగ్గులేసిన మాస్టర్ ప్లాన్ బాధిత రైతు కుటుంబాలు

Satyam NEWS

Leave a Comment