జూన్ 10 న జరగనున్న జాతీయ లోక్అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాలుల లో పోలీస్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు.
రాజీకాదగిన పెండింగ్ క్రిమినల్ కేసులు మరియు ఇ -పిటి కేసుల వివరాలను ఠాణాల వారిగ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అందరు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ సారి జరిగే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసులను పరిష్కరించడం ద్వారా జిల్లాను ఉన్నత స్థానంలో తీసుకురావడం కోసం పోలీస్ అధికారులు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డి.ఎస్.పి రెహమాన్, ఎ పీపీ లు విశ్వశాంతి, లావణ్య కొత్తగూడెం కోర్టు పరిధిలో ఉన్న పోలీస్, ఎక్సయ్ జ్ అధికారులు, లైజన్ ఆఫీసర్ వీరబాబు,హరగోపాల్ కోర్టు కానిస్టేబుల్స్, న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు.