37.2 C
Hyderabad
April 30, 2024 11: 25 AM
Slider ఖమ్మం

జూన్,జూలై నెలల్లో సమరశీల పోరాటాలు

#CPM Party

పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం రానున్న జూన్ జూలై నెలల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు, ఈ ఆందోళన పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.

స్థానిక ఖమ్మం సుందరయ్య భవనంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బుగ్గ వీటి సరళ అధ్యక్షులు జరిగిన పాలేరు నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న స్థానిక సమస్యలపై జూన్ జూలై నెలలో మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించినట్టు, ఈ ఆందోళన పోరాటాలకు ప్రజలు కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని, ప్రతి మండలంలో మినీ స్టేడియంలు ఏర్పాటు చేయాలని,ప్రతి మండల కేంద్రంలో వ్యవసాయ గోడౌన్స్ ఏర్పాటు చేయాలని, ఖమ్మం రూరల్ మండలంలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను, ఎస్సీ బాలుర బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని, అర్హులైన వాళ్లందరికీ ఇల్లు స్థలాలు ఇవ్వాలని, డబల్ బెడ్రూమ్స్ అన్ని గ్రామాలకు మంజూరు చేయాలని,భక్త రామదాసు లింకు కాలువలు తిరుమలయపాలెం మండలంలో అన్ని గ్రామాలకు ఇవ్వాలని తదితర సమస్యలు, ఇంకా స్థానిక సమస్యల పైన ఆందోళనలో పోరాటాలు చేయునట్లు ఆయన తెలియజేశారు.

గ్రామ దీపికలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం శ్రేణులు మద్దతు తెలియజేయాలని, అన్ని మండల కేంద్రాల్లో వారికి మద్దతుగా ఆందోళన నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.బిజెపి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తుందని ఇలాంటి తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టే విధంగా కార్యకర్తలు సిద్ధం కావాలని, ప్రజలకు నిజాలు తెలిపేందుకు కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు .

ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ రానున్న కాలం పోరాటాల కాలమని జిల్లావ్యాప్తంగా అన్ని సమస్యల పైన పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక మినీ పరిశ్రమను ప్రారంభించాలని ఇంకా ఇంట్లో ఇళ్ల స్థలాలు డబల్ బెడ్రూమ్స్, తదితర సమస్యల పైన జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఆయన తెలియజేశారు. పాలేరు నియోజకవర్గంలో బలమైన పార్టీగా సిపిఎం ఉందని, మిత్రపక్షల ఐక్యతతో పాలేరుని గెలుచుకోవాలని, ఆ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.

Related posts

ప్రూవ్డ్ కరెక్ట్: విశాఖ తరలివెళ్లడంపై సత్యం న్యూస్ చెప్పిందే జరిగింది

Satyam NEWS

హుజూర్ నగర్ గ్రంథాలయ నూతన కమిటీ నియామకం

Satyam NEWS

స్వార్ధ రాజకీయాలు పోవాలి: బీజేపీ మళ్లీ రావాలి

Satyam NEWS

Leave a Comment