జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో అధికారులతో ఎస్డీఎఫ్, సిడిపి, డిఎంఎఫ్టి, సీఎం ఆన్స్యూరెన్స్ నిధులతో చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పనులు అగ్రిమెంట్ ప్రకారం నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. శాఖల వారిగా చేపడుతున్న పనులు, పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్న పనుల పూర్తికి కార్యాచరణ గురించి సూచనలు చేశారు.
ప్రతి రోజు పనుల పురోగతి పై అధికారులు సమీక్ష చేయాలన్నారు. జూన్ మొదటి వారంలోగా ఎస్డీఎఫ్, సిడిపి, డిఎంఎఫ్టి నిధులతో చేపడుతున్న పనులు పూర్తవ్వాలన్నారు.
సీఎం ఆస్యూరెన్స్ క్రింద జిల్లాకు రూ. 248.40 కోట్లు 3,194 పనులకుగాను మంజూరు అయినట్లుఆయన తెలిపారు. ఇట్టి పనులకు టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి, జూన్ మొదటి వారంలోగా పనులన్నీ గ్రౌండింగ్ అయ్యేట్లు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో సిపిఓ శ్రీనివాస్, జెడ్పి సిఇఓ అప్పారావు, పీఆర్ ఎస్ఇ సుదర్శన్, వివిధ శాఖల ఇఇ లు శ్యామప్రసాద్, కెవికె. శ్రీనివాస్, చంద్రమౌళి, తానాజీ, రంజిత్, కృష్ణలాల్, పుష్పాలత, ఉమామహేశ్వరరావు, డిఇలు, ఏఇలు తదితరులు పాల్గొన్నారు.