హైదరాబాదులోనే బెస్ట్ పార్కుగా సుందరయ్య పార్కును అభివృద్ధి చేయడం జరిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పార్కును ఆయన పున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకర్స్ కు అనుగుణంగా పార్కుని మరింత సుందరీకరించడం జరిగిందని తెలిపారు.
పార్క్ లో ఓపెన్ జిమ్ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. పార్క కు వచ్చే వాకర్స్ కి , సందర్శకులకు అనుగుణంగా పార్కును పచ్చదనంతో మరింత సుందరికరించడం జరిగిందని వివరించారు. వాకర్స్ పార్కు కు సంబంధించిన సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రవి చారి, బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జైసింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ రావులపాటి మోజస్, కార్యదర్శి దామోదర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు బబ్లు, రమేష్ రెడ్డి, కిషన్ రావు, నాగభూషణం, ముదిగొండ మురళి, జయదేవ్, శంకర్ ముదిరాజ్, జనార్ధన్, కొండమడుగు మధు, ఎడ్ల సత్యనారాయణ,
టీవీ రాజు, శివ యాదవ్, జనార్ధన్, వెంకటేష్, లక్ష్మీ గణపతి దేవస్థానం చైర్మన్ ముచ్చ కుర్తి ప్రభాకర్, సంపత్, సునీల్, మహేష్, శైలజ, మరియా, సుగుణ ,రేఖ నిరంజన్ రెడ్డి, కూరగాయల శ్రీనివాస్, నాగబాబు, రఘువీరా రెడ్డి, రత్నాకర్ రెడ్డి, కృష్ణ, సంతోష్ గౌడ్, కృష్ణ, జిహెచ్ఎంసి జూబిడి డైరెక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, మేనేజర్ భాస్కర్, మరియు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.