హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. 98 ఏళ్ల వయసులో ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన కన్నుమూసినట్లు తెలిసింది. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో వరి వంగడాలు సృష్టించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రామన్ మెగసెసె లాంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. స్వామినాథన్ 1925 ఆగస్టు7న జన్మించారు.
previous post
next post