42.2 C
Hyderabad
April 26, 2024 16: 53 PM
Slider నిజామాబాద్

కరోనా హెల్ప్: ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మాస్కుల వితరణ

RSS Mask

కరోనా ను అరికట్టేందుకు, ప్రజలు కరోనా నుండి రక్షణ పొందేందుకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఖండ  కార్యవాహ ఆధ్వర్యంలో  మాస్కుల వితరణ చేశారు. గ్రామంలోని రేషన్ షాపుల వద్ద ప్రజలకు మాస్కులు పంచి కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు.

అనంతరం ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు,పోలీసులకు మాస్కులు అందజేశారు. మొత్తం 1000 మాస్కులను నాలుగు విడతల్లో పంపిణీ చేస్తామని, ప్రస్తుతం 250 మాస్కులు పంపిణీ చేసినట్టు కోటగిరి ఖండ కార్యవాహ కమ్మరి విఠల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖండ సహ కార్యవహ నాగనాథ్, ఖండ శారీరక ప్రముఖ్ గాండ్ల గోపి , ఖండ సహశరిరక్ ప్రముఖ్ సుభాష్,తమ్మలి శివ, ఉప మండల ప్రముఖ్ కమ్మరి వేణు,గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ఎస్సై మచ్చెందర్ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

ఎన్నికల సంఘం కార్యదర్శిగా వాణీమోహన్

Satyam NEWS

రైతులకు ఏక మొత్తంగా ఋణమాఫీ చేయాలని బ్యాంకు ఎదుట ధర్నా

Satyam NEWS

4276 చెక్కులకు గాను రూ. 18.58 కోట్లు పంపిణీ

Murali Krishna

Leave a Comment