25.7 C
Hyderabad
May 18, 2024 09: 51 AM
Slider విజయనగరం

ఈ నెల 27 ఓటీఎస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున టీడీపీ ధర్నా…!

#ashokgajapatiraju

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు ఈనెల 27 వ తేదీన ప్రభుత్వం చేస్తున్న ఓటీఎస్ వసూళ్లు కు వ్యతిరేకంగా జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనుంది. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం జరుగుతుందని ఆ పార్టీ పేర్కొంది.

జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,  విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున నిర్వహించిన జూమ్ మీటింగ్ లో పార్టీ ని ఆదేశించారు. జిల్లాలో గల 9 నియోజకవర్గాల నేతలు అరకు పార్లమెంట్ అధ్యక్షులు గుమ్మిడి సంధ్యారాణి , రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఆర్. పి. భంజ్ దేవ్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ , నియోజకవర్గ ఇంచార్జ్ లు పతివాడ నారాయణస్వామి నాయుడు, డా. కొండపల్లి అప్పలనాయుడు , కోళ్ల లలితకుమారి,   బొబ్బిలి చిరంజీవులు , నియోజకవర్గ ఇంచార్జి  బేబీ  నాయన,  పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి. రాజు , పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యేలా చూసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.

Related posts

బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబాకు అభిషేకం

Satyam NEWS

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం కొణిజేటి రోశయ్య మృతికి సంతాపం

Satyam NEWS

150 మంది పోలీసులతో మాజీ సీఎం కు బందోబస్తు…!

Satyam NEWS

Leave a Comment