తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈనెల 27 వ తేదీన ప్రభుత్వం చేస్తున్న ఓటీఎస్ వసూళ్లు కు వ్యతిరేకంగా జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనుంది. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం జరుగుతుందని ఆ పార్టీ పేర్కొంది.
జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున నిర్వహించిన జూమ్ మీటింగ్ లో పార్టీ ని ఆదేశించారు. జిల్లాలో గల 9 నియోజకవర్గాల నేతలు అరకు పార్లమెంట్ అధ్యక్షులు గుమ్మిడి సంధ్యారాణి , రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఆర్. పి. భంజ్ దేవ్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ , నియోజకవర్గ ఇంచార్జ్ లు పతివాడ నారాయణస్వామి నాయుడు, డా. కొండపల్లి అప్పలనాయుడు , కోళ్ల లలితకుమారి, బొబ్బిలి చిరంజీవులు , నియోజకవర్గ ఇంచార్జి బేబీ నాయన, పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి. రాజు , పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యేలా చూసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.