ఉత్తరాంధ్ర లో “ఇదేం ఖర్మ మన రాష్ఠ్రానికి”…అన్న టీడీపీ నిరసన కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. విజయనగరం కోట జంక్షన్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు దాదాపు 150 మంది తో పోలీసు బందోబస్తు నిర్వహిస్తోంది…పోలీసు శాఖ. విజయనగరం ఇంచార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో… జిల్లా పోలీసు బాస్ దీపికా ఆదేశాల మేరకు నగరంలో ద్వారపూడి నుంచీ భారీ బందోబస్తు కల్పించారు.. పోలీసులు. టీడీపీ అధినేత… ద్వార పూడి నుంచీ… ర్యాలీ గా బయలుదేరి… కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు నగర సీఎం డా.వెంకటరావు, రూరల్ సీఐ తిరుపతి…సమక్షంలో మొత్తం 150కి పైగా పోలీసులు ప్రతీ జంక్షన్ లో పదిమంది చొప్పున భారీ గా బందోబస్తు కల్పించారు.
previous post