పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో దారుణం జరిగింది. బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేయడం కలకలం సృష్టించింది. ప్రత్యేక పాత్రలతో అభిషేకం చేయకుండా ఆల్కహాల్ సీసాలతో అభిషేకం చేయడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఈ కొత్తరకం సంప్రదాయం ఏంటని బాబా భక్తులు మండిపడుతున్నారు. సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామస్థులు చేసిన ఈ పూజలు, అభిషేకం వివాదంగా మారింది. మద్యం సీసాలో తేనే, ఇతర ద్రవ్యాలు మాత్రమే ఉన్నాయని ఆలయ నిర్వాహకులు చెబుతున్నా కూడా బాబా విగ్రహానికి మద్యం సీసాలతో అభిషేకం చేయడాన్ని బాబా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ సీసాలతో అభిషేకం చేయడం దేవుడ్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
previous post