టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్ రామ్ రెడ్డి అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు ఆమె బాన్సువాడ మండల పరిధిలోని కొల్లుర్, నాగారం,బోర్లం గ్రామాలలో పర్యటించారు. అక్కడ ఆశ వర్కర్ల ను, పారిశుద్ధ్య కార్మికులను, ANM సిస్టర్స్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా” స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో, అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ నాయకులు, మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.
జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం