గత ఆర్ధిక సంవత్సరంలో వంద బస్ స్టేషన్లను ఆధునీకరించామని, ఈ యేడాదిలో మరో 150 బస్ స్టేషన్లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందించామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. అనేక సమస్యలను అధిగమించి ఆర్టీసీ గడిచిన రెండేళ్లలో చేపట్టిన సంస్కరణలతో ప్రజలకు చేరువైందని అన్నారు.
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నామని, ఇప్పటి వరకు 7 డీఏలను ప్రకటించామని, దీంతో వారి వేతనాలు 35 శాతం వరకు పెరిగాయన్నారు. రెండేళ్లుగా సంస్థను ప్రజలు ఆశించిన స్థాయిలో ఆదరించడంతో రాబడి పెరుగుతోందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం త్వరలోనే మహారాష్ట్రలోని షిర్డీ, ఏపీలోని శ్రీశైలానికి టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తామన్నారు.