దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్న సందర్భాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహ రావు గారిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పీవీ 102 వ జయంతి సందర్భంగా ఖమ్మం నగరం లాకారం సర్కిల్ నందు గల పీవీ విగ్రహానికి మంత్రి పువ్వాడ, జిల్లా కలెక్టర్ గౌతమ్ లు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగినరీతిలో గౌరవిస్తుందన్నారు.పీవీ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు.