24.7 C
Hyderabad
May 17, 2024 00: 55 AM
Slider

బ్రదర్ అనిల్ కుమార్ సభలను విజయవంతం చేయండి

ఆధ్యాత్మిక బోధనలే మానవుని జీవితానికి ప్రశాంతతను ఇస్తాయని,అంతర్జాతీయ ప్రసంగీకులు బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొనే సభలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. గుడివాడ శోభన హోటల్ నందు మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగిన సమావేశంలో రెవ.డా.నేలపాటి సామ్యేలు అధ్యక్షత వహించగా,అనిల్ వరల్డ్ ఇవాంజలిజం మీటింగ్స్ కోఆర్డినేటర్ బ్రదర్.పి.సామ్యూల్ విచ్చేసి జనవరి 15, 16, 17 తేదీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయే యేసుక్రీస్తు ఆశీర్వాద పండగలలో అంతర్జాతీయ ప్రసంగీకులు బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొని ఆధ్యాత్మిక దైవ సందేశాలను ఇస్తారని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని,దైవ సేవకులు,సంఘాలు కలిసి సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో దైవ సేవకులు కేజే విక్టర్ పాల్ ఈ పని గొప్పది అనే అంశంపై వాక్య సందేశాన్ని అందించారు. బిషప్‌. డా.అప్పికట్ల జాషువా గ్రీటింగ్స్ తెలిపారు.ఈ సమావేశంలో గుడివాడ స్థానిక కన్వీనర్స్ రెవ.బి. ప్రభాకర్ రెడ్డి,రెవ.డా‌.

నేలపాటి సామ్యూల్, రెవ.ఈదా డేవిడ్ రాజు,రెవ.డా. కేజే విక్టర్ పాల్,రెవ.జి. శ్యాంబాబు,ప్రార్థనలు చేసి గోడ పత్రికలను మరియు కరపత్రాలను రిలీజ్ చేశారు‌.ఈ కార్యక్రమంలో 17 మండలాల సేవకులు, ప్రతినిధుల పాల్గొనగా,ఈ సమావేశంలో రెవ.కె.ఎలైజ,రెవ.మందా సువర్ణబాబు,రెవ.జడ జానన్న, రెవ‌.జాషువా జ్యోతి అనేకమంది దైవ సేవకులు పాల్గొన్నారు.

Related posts

మ‌ల్ల‌న్న కొలువులో జ్యోతిర్ముడి స‌మ‌ర్పించిన‌ మంత్రి

Sub Editor

భూయాన్, భట్టి ల పదోన్నతులకు కోలేజియం సిఫార్సు

Bhavani

లింగగిరి పి హెచ్ సి అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం

Satyam NEWS

Leave a Comment