లింగగిరి పి హెచ్ సి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం లింగగిరి గ్రామంలో జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి గ్రామంలో జరిగిన పి హెచ్ సి సమావేశానికి హుజుర్ నగర్ మండల పరిషత్ అధ్యక్షుడు గూడెపు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మండల జడ్పీటిసి కొప్పుల సైదిరెడ్డి పాల్గొన్నారు.
లింగగిరి గ్రామంలోని పి హెచ్ సి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలం నందు రోగులు,వారి బంధువులు వేచి ఉండేందుకు షెడ్డు నిర్మాణమునకు జిల్లాపరిషత్ నిధులనుండి నిధులు కేటాయించే విధంగా చేస్తానని చెప్పారు. అదే విధంగా శాసనసభ్యుడు సైదిరెడ్డి సహకారంతో మరిన్ని అదనపు నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని జడ్పీ టిసి కొప్పుల సైదిరెడ్డి అన్నారు. పి హెచ్ సి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని యం పి పి గూడెపు శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో లింగగిరి సర్పంచ్ కర్నాటి అంజిరెడ్డి, ఎంపిటిసి శ్రీమతి వి. విజయలక్ష్మీ,డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, ఎంపిడిఓ గంటా వరప్రసాద్, ఎం పి ఓ షేక్ మౌలానా,డిప్యూటీ తహసిల్దార్ భాస్కర్, అంజలీపురం ఉప సర్పంచ్ భాస్కర రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.