అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో సమరత సేవా ఫౌండేషన్ హిందు ధర్మ ప్రచారంకు సంబంధించిన పోస్టర్ ను వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్ పర్సన్ దూడల విరీతా దేవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా విరీతదేవి మాట్లాడుతూ ధర్మం ఆచరించాలని ప్రతిఒక్కరు ప్రచారం చేయాలన్నారు.
ధర్మాన్ని పాటిస్తే సమాజంలో అరాచకాలు, నేరాలు, ఘోరాలు జరిగే అవకాశం ఉండదన్నారు. సమాజం ప్రశాంతతో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ వైస్సార్సీపీ యువత అధ్యక్షులు దూడల ఫణి, తో పాటు సమరత సేవా ఫౌండేషన్ కన్వీనర్లు, ధర్మ ప్రచారక్లు,కాపు నాయకులుఆర్లపల్లి ముత్యాలు పాల్గొన్నారు.