విజయనగరం జిల్లా లో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరయ్యేందుకు రాష్ట్ర సీఎం జగన్ బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో దాకమర్రిలోని రఘు ఇంజనీరింగ్ కళాశాలలో వివాహ వేదిక, కళాశాల ప్రాంగణానికి ఎదురుగా ఉన్న ఎన్.సి.సి. మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు.
సీఎం జగన్ ఈ నెల 14 వ తేదీ బుధవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నం, అక్కడ నుంచి హెలీక్యాప్టర్ ద్వారా నుంచి రఘు ఇంజీనీరింగ్ కళాశాల ఎదురుగా ఎన్.సి.సి. మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి కాన్వాయ్ ద్వారా కళాశాల లోపల ఏర్పాటు చేస్తున్నరిసెప్షన్ వేదిక వద్దకు చేరుకుంటారు.
ఈ మేరకు పోలీసు, రెవెన్యూ అధికారులు సంబంధిత ఏర్పాట్లు చేస్తున్నారు.వీఐపీలు వేదిక వద్దకు చేరుకొనేందుకు రఘు ఇంజనీరింగ్ కళాశాల మెయిన్ గేటు నుంచి ప్రవేశం కల్పించగా, ఇతరులకు మోపాడ రోడ్డు నుంచి ప్రవేశం కల్పించారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రఘు కళాశాల సమీపంలో బారీకేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ రోజు రఘు కళాశాల ప్రాంగణంలో, హెలీప్యాడ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి,విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్ పర్యవేక్షించారు. అధికారులకు, సిబ్బందికి ఏర్పాట్లకు సంబంధించిన సూచనలు చేశారు.