త్వరలో తిరుపతి లోక్సభకు ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు ముందుగానే టీడీపీ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేరును...
ఈ నెల 24వ తేది మంగళవారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుపతి, తిరుమల పర్యటనకు వస్తున్నందున ముందస్తు ఏర్పాట్లను అధికారులు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా...
అమీన్ పూర్ మండలం నరేంద్ర నగర్ కాలని లేఅవుట్ కు సమాధానం దొరకటం లేదు. కస్టోడియన్స్ అయితే అమీన్ పూర్ మునిసిపాలిటీ అని వేరే చెప్ప నక్కర లేదు. ఇక్కడ కస్టోడియన్ అంటే ఆ...
రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించేందుకు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాశయ్య...
అవసరాలకు అనుగుణంగా విస్తరణ పనులతో విశాఖ పోర్టు ట్రస్ట్ ప్రగతి పథంలో పయనిస్తోంది. వచ్చే మూడేళ్లలో నిర్వహణ సామర్థ్యాన్నిమరింత పెంచుకునేందుకు సొబగులద్దుకుంటోంది. 126.89 మిలియన్ టన్నుల నుంచి 141.64 మిలియన్ టన్నులకు పెరగనున్న పోర్టు...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం దీపావళి పండగ సందర్భంగా జోరుగా పేకాట నడుస్తోంది. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఇక్కడ దీపావళి పండుగ వచ్చిందంటే లక్ష్మీపూజ బాణసంచా ఎంత పేలుతాయో పేకాట కూడా అంతకు...
జిహెచ్ఎంసి కార్మికుల వేతనాన్ని3వేల రూపాయలు, జిహెచ్ఎంసి ఆస్తి పన్ను50 శాతం రాయితీ ఇచ్చిన కేసీఆర్ కు అంబర్ పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట్...
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఆదివారం నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ చిత్రపటాలకు...
అన్నిరకాల క్రీడలకు నిలయంగా విజ్జీ స్టేడియంను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రిబొత్స సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మంత్రి విజ్జి స్టేడియంలో జరుగుతున్న పనులను తనిఖీ చేసారు. క్రికెట్ స్టేడియం, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్ రింగ్, ఖేలో ఇండియా కింద చేపడుతున్నమల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులపై ఆరా తీసారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, చేయాల్సిన పనులు, అవసరమైన నిధులు, తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారుచేసి ఇవ్వాలని, సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి పనులు జరిగేలా చూస్తానని అధికారులకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్నపనులువేగంగా జరగాలని, డి.పి.ఆర్. ప్రకారం నిర్ధేశిత కాలంలో పూర్తి చేయాలని ఆయా ఇంజనీర్లను ఆదేశించారు. ఖేలో ఇండియా క్రింద రూ.6 కోట్లుతో మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు జరుగుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన నిష్పత్తిలో నిధులు ఖర్చు చేయడం జరుగుతోందని,60 శాతం పనులు పూర్తయ్యాయని శాప్ సహాయ సంచాలకులు రమణ తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రూ.3 కోట్లు నిధులు వచ్చాయని, రూ2.5 కోట్లు విఎంఆర్డిఎ, 25 లక్షలు మున్సిపల్, 25 లక్షలు ఎం.పి. ల్యాడ్స్ నుండి రావలసి ఉందని ఎడి రమణ తెలిపారు. విఎంఆర్డిఎ కమిషనర్తో టెలిఫోన్ ద్వారా నిధుల కోసం మంత్రి మాట్లాడారు. విజ్జి స్టేడియం పనులు తనిఖీచేసి నిధులను విడుదల చేయాలని కమిషనర్ కోటేశ్వరరావును కోరారు. జిల్లాలో గతంలో మంజూరైన వై.ఎస్.ఆర్. క్రీడా వికాస కేంద్రాల పనులను కూడా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాజీవ్ క్రీడా మైదానాన్ని కూడా తనిఖీ చేసి అక్కడ కూడా క్రీడాకారులకు అనువుగా వుండేలా అభివృద్ది చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అదేవిధంగా ఎ.పి. మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రోజక్ట్ రూ.20 కోట్లతో చేపట్టడం జరిగిందని, క్రీడా సౌకర్యాలు, అకామడేషన్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లను నిర్మిస్తున్నామని, పనులు పురోగతిలో ఉన్నాయని రమణ వివరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టరు జె. వెంకటరావు, ఆర్డిఓ భవానిశంకర్, సెట్విజ్ సిఇఓ తదితరులు పాల్గొన్నారు....
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కు 22 లక్షల విలువ చేసే మినీ బస్ ను హైదరాబాదుకు చెందిన జెవీ భాను మూర్తి అందజేశారు. సంస్థ తరపున నందమూరి బాలకృష్ణ,...