రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించేందుకు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా కాశయ్య మాట్లాడుతూ టిడ్కోఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాల్సిందేనని అన్నారు. అవినీతి జరిగిందన్నకారణంతో ఇళ్లను ఇవ్వకపోవడం పనులను పెండింగులో పెట్టడం మంచి విధానం కాదని అన్నారు.
ప్రతి పేదవారికి ఇల్లు ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు సిపిఐ పోరాటం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.