29.7 C
Hyderabad
April 29, 2024 10: 03 AM

Tag : minister bostha

Slider విజయనగరం

ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాప‌న చేయ‌నున్నసీఎం

Sub Editor
విద్య‌, వైద్యం ప్ర‌భుత్వానికి రెండు క‌ళ్లులాంటివ‌ని ఆరోగ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థాప‌నే సీఎం జగన్ ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర పురపాలక, పట్టాణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్ప‌ష్టం చేశారు. గ‌జ‌ప‌తిన‌గ‌రంలో ఏపి వైద్య విధాన‌ప‌రిషత్, ఎపీఎంఎస్ఐడీసీ...
Slider విజయనగరం

ఇరిగేష‌న్ అధికారుల‌పై మంత్రి ఆగ్రహం..!

Sub Editor
విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిర్మాణంలో ఉన్నసాగునీటి ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆదేశించారు. దీనికోసం రెండు రోజుల్లో స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని ఆయ‌న సూచించారు. సాగునీటి...
Slider విజయనగరం

క్రీడలకు నిలయంగా విజ్జి స్టేడియం

Sub Editor
అన్నిరకాల క్రీడలకు నిలయంగా విజ్జీ స్టేడియంను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రిబొత్స సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మంత్రి విజ్జి స్టేడియంలో జరుగుతున్న పనులను తనిఖీ చేసారు. క్రికెట్ స్టేడియం, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్ రింగ్, ఖేలో ఇండియా కింద చేపడుతున్నమల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులపై ఆరా తీసారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, చేయాల్సిన పనులు, అవసరమైన నిధులు, తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారుచేసి ఇవ్వాలని, సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి పనులు జరిగేలా చూస్తానని అధికారులకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్నప‌నులువేగంగా జరగాలని, డి.పి.ఆర్. ప్రకారం నిర్ధేశిత కాలంలో పూర్తి చేయాలని ఆయా ఇంజనీర్లను ఆదేశించారు. ఖేలో ఇండియా క్రింద రూ.6 కోట్లుతో మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు జరుగుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన నిష్పత్తిలో నిధులు ఖర్చు చేయడం జరుగుతోందని,60 శాతం పనులు పూర్తయ్యాయని శాప్ సహాయ సంచాలకులు రమణ తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రూ.3 కోట్లు నిధులు వచ్చాయని, రూ2.5 కోట్లు విఎంఆర్డిఎ, 25 లక్షలు మున్సిపల్, 25 లక్షలు ఎం.పి. ల్యాడ్స్ నుండి రావలసి ఉందని ఎడి రమణ తెలిపారు.  విఎంఆర్డిఎ కమిషనర్తో  టెలిఫోన్ ద్వారా నిధుల కోసం మంత్రి మాట్లాడారు.  విజ్జి స్టేడియం పనులు తనిఖీచేసి నిధులను విడుదల చేయాలని కమిషనర్ కోటేశ్వరరావును కోరారు. జిల్లాలో గతంలో మంజూరైన వై.ఎస్.ఆర్. క్రీడా వికాస కేంద్రాల పనులను కూడా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాజీవ్ క్రీడా మైదానాన్ని కూడా తనిఖీ చేసి అక్కడ కూడా క్రీడాకారులకు అనువుగా వుండేలా అభివృద్ది చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  అదేవిధంగా ఎ.పి. మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రోజక్ట్ రూ.20 కోట్లతో చేపట్టడం జరిగిందని, క్రీడా సౌకర్యాలు, అకామడేషన్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లను నిర్మిస్తున్నామ‌ని, పనులు పురోగతిలో ఉన్నాయని రమణ వివరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టరు జె. వెంకటరావు, ఆర్డిఓ భవానిశంకర్, సెట్విజ్ సిఇఓ త‌దిత‌రులు పాల్గొన్నారు....