బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కు 22 లక్షల విలువ చేసే మినీ బస్ ను హైదరాబాదుకు చెందిన జెవీ భాను మూర్తి అందజేశారు. సంస్థ తరపున నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఈ మినీ బస్ ను స్వీకరించారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ జెవీ భాను మూర్తి తన భార్య జోస్యుల సత్యవాణి జ్ఞాపకార్థం చేసిన మంచి పని క్యాన్సర్ రోగుల సేవలను మరింత విస్తృత పరిచేందుకు వినియోగపడుతుందని అన్నారు. ఎందరో పేదలకు క్యాన్సర్ చికిత్స అందించడానికి సంస్థ చేస్తున్న కృషికి ఇలాంటి దాతలు అందిస్తున్న సహాయసహకారాలు మరువలేనివని, ఇలాంటి ఎందరో మహానుభావులు ఆశిస్తున్నట్లు సంస్థ భవిష్యత్తులో మరింత మంది పేదవారికి అంతర్జాతీయ వైద్య సేవలను అందుబాటైన ధరలలోనే అందిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ తో పాటూ డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI, జి రవికుమార్, COO, BIACH&RI, Dr TS రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI తో పాటూ దాతలు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.