29.7 C
Hyderabad
May 4, 2024 03: 12 AM
Slider హైదరాబాద్

సీఎం, మంత్రికి పాలాభిషేకం

ghmc

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఆదివారం నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వ‌హించారు. అనంతరం ట‌పాసులు కాల్చి స్వీట్స్ పంచుకున్నారు.


ఈ సందర్భంగా కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు మరువరానివని కొనియాడారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిస్వార్థంగా సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులను గుర్తిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు వారి వేతనాలు పెంచడం ఎంతో సంతోషకరమని తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కి. శ్యామ్, భగవాన్, రాజు గౌడ్ పారిశుధ్య సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం స్పందనలో 32 ఫిర్యాదులు

Satyam NEWS

కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన స్థలం ఇవ్వాలి

Satyam NEWS

ఫస్ట్ నుంచి పంతుళ్ల కు పరేషాన్ మొదలు

Satyam NEWS

Leave a Comment