జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అనుకుని నిర్మిస్తున్న విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం భూ సేకరణ విషయంలో ప్రభుత్వం ఇస్తున్న నష్టపరహారంపై దృష్టి పట్టాలని టీడీపీ నేత కిమిడి నాగార్జున కోరారు. కలెక్టరేట్ లోజరిగినస్పందన కార్యక్రమంలో ఈ మేరకు టీడీపీ నేతలైన కనకల ,కర్రోతు.ఐవీపీ రాజులతో కలిసి నాగార్జున కలెక్టర్ కువినతి పత్రం అంద చేసారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ కై భూములకు అర్హులైన రైతులకు పరిహారం చెల్లించకుండా బినామీ రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు.
ఆ విషయమై తగు విచారణ జరిపి అర్హులైన వారికి నష్ట పరిహారం ఇవ్వాలని కలెక్టర్ సూర్యకుమారీకి గ్రీవెన్స్ సెల్ లో వినితపత్రం ఇచ్చారు. ఈ మేరకు టీడీపీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున సమక్షంలో, మాజీ ఎంఎల్ ఏ పతివాడ నారాయణస్వామి నాయుడుతో ఆధ్వర్యంలో నెల్లిమర్ల నియోజకవర్గ నాయకులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహ కార్యదర్శి మహంతి చిన్నం నాయుడు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కర్రోతు బంగార్రాజు, మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పతివాడ తారక రామానాయుడు, బైరెడ్డి లీలావతి తదితరులు పాల్గొన్నారు.