27.7 C
Hyderabad
May 18, 2024 00: 01 AM
Slider హైదరాబాద్

బాగ్ అంబర్ పేట్ లో బీజేపీ ప్రజా గోస మీటింగ్

#bjpcity

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ బాగ్ అంబర్ పేట్ లో భారతీయ జనతా పార్టీ ప్రజాగోస – బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించింది. పోలింగ్ బూత్ నంబర్లు 60,74,75,76 శాంతినగర్ లో శక్తి కేంద్ర ప్రముఖ కాశం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇన్చార్జ్బి .వెంకట్ రెడ్డి, బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ బి.పద్మ, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి, బిజెపి వెంగళరావు నగర్ డివిజన్ ఇంచార్జ్ ఏడెల్లి అజయ్ కుమార్, డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్కా జగన్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో విశేష ప్రజాదరణ లభించడమే కాక ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను వివరించారు. కెసిఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న పేద ప్రజల వ్యతిరేక విధానాన్ని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోడూరు సురేష్ కుమార్, సహప్రముఖ్ ఆర్బీఐ రమేష్, బూత్ ఆద్యక్షలు ట్యూషన్ శేఖర్, శాంతినగర్ హేమంత్, నందనవనం హేమంత్, హంసరాజ్, సంజీవ్ చౌదరి, ఎం.శ్రీనివాస్, పి నాగరాజు చారి, సునంద, కవిత, వరలక్ష్మి, శ్రీనివాస్, శివ కుమార్, వెంకటేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

కోనసీమ వైకాపాకు బిగ్ షాక్

Satyam NEWS

మహిళపై పోలీసు అధికారి లైంగిక దాడులు సిగ్గు చేటు

Satyam NEWS

చీరాల మున్సిపల్ అధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ షోకాజ్ నోటీసు

Satyam NEWS

Leave a Comment