కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. మొత్తం 24 వార్డులకు గాను 12 టిడిపి, 11 వైసిపి, 1 జనసేన కైవసం చేసుకున్నాయి.
దాంతో మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో జనసేన కీలకం కానున్నది. జనసేన మద్దతు కూడగట్టేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు త్రీవ ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే జనసేన పార్టీ అభ్యర్ధి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఇప్పటికే ఇరు పార్టీల నేతలు తమ అభ్యర్థులను ప్రత్యేక బస్సులో పక్క రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.