శ్రీ శుభకృత నామ సంవత్సర పంచాంగం రచించిన వనపర్తికి చెందిన ఒరుగంటి.మనోహర శర్మ సిద్ధాంతిని, ఆయన కుమారుడు నాగరాజు శర్మ సిద్ధాంతి కి వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రావుల ఫోన్ ద్వారా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పంచాంగ పుస్తకాలు రచించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్న మనోహరశర్మ అభినందనీయులని అన్నారు.అనంతరం రావుల ప్రతినిధులుగా నందిమల్ల అశోక్, ఏర్పుల రవి యాదవ్, అనిల్, మనోహరశర్మ, నాగరాజు శర్మను సన్మానించి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్