40.2 C
Hyderabad
April 28, 2024 15: 36 PM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ లో నేడు కేటీఆర్ సభకు మాజీ మంత్రి జూపల్లి వస్తారా?

#ministerjupally

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ బహిరంగ సభ ఈరోజు కొల్లాపూర్ లో నిర్వహిస్తున్నారు. ఈ సభకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దూరమువున్నట్లు తెలుస్తోంది. జూపల్లి తో కేటీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది.అయితే టిఆర్ఎస్ సీనియర్ నాయకుల పై ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నాయకులను,జూపల్లి వర్గీయులను కొందరు ఎస్ ఐలు టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మంత్రి కి తెలిపారు.

ఆధారాలు లేకున్న కేసులు పెడుతున్నారని కూడా మంత్రికి వివరించారని తెలిసింది. రైతుల సమస్యలపై మాట్లాడినా, ప్రజల సమస్యలపై ప్రశ్నించిన వారి పై అక్రమ కేసులు పెట్టిస్తు జైల్ కు పంపిస్తున్నారని, అందుకే పిలుపు వచ్చినా కానీ జూపల్లి ఈ సభకు హాజరు కావడం లేదని తెలుస్తుంది. 2017లో కెటిఆర్ కొల్లాపూర్ కు వచ్చారు. ఆ సమయంలో అభివృద్ధి సంక్షేమాలకు జూపల్లి ఆధ్వర్యంలో శిలాఫలకాలు వేశారు.

2018ఎన్నికల ఫలితాల అనంతరం స్థానిక పాలకులు మారారు. ఆనాటి శిలా పలకలను, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్నారు. జూపల్లి గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ తో హామీ ఇప్పించిన గోపాల్ దిన్నె సిగోటం రిజర్వాయర్ కార్యక్రమాలను నేడు కేటీఆర్ ప్రారంభించునున్నారు.

అదే విధంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో నేడు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి జూపల్లి దూరంగా ఉండబబోతునట్లు తెలుస్తుంది.

Related posts

చలికాలంలో కరోనా ప్రబలే అవకాశం చాలా ఎక్కువ

Satyam NEWS

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అరెస్టు

Satyam NEWS

గుడ్ న్యూస్: డాక్టర్లకు, వైద్య సిబ్బందికి శాలరీ కట్ లేదు

Satyam NEWS

Leave a Comment