38.2 C
Hyderabad
April 29, 2024 21: 11 PM
Slider హైదరాబాద్

షేక్ పేట గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం

#fire

ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ గదిలో వినాయకుడిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు. పూజలో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు.

దీపం ఆరిపోకుండా చూడడం కోసం చుట్టూ దుప్పట్లతో తెర ఏర్పాటు చేశారు. గాలికి దుప్పటికి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు.

బయటకు వెళ్తున్న క్రమంలో మంటల్లో చిక్కుకున్న నీరజ్ అనే విద్యార్థి తో పాటు మరో విద్యార్థికి గాయాలయ్యాయి, ఇద్దరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఘటనపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సకాలంలో విద్యార్థులు బయటకు పరిగెత్తటంతో ముప్పు తప్పింది.

Related posts

సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బతిన్న జగన్ సర్కార్

Satyam NEWS

ఐఏఎస్… ఐపీఎస్ లు బీఆర్ఎస్ పార్టీ తొత్తులా

Bhavani

కరోనాతో ఒక్కరోజే 9 మంది మృతి

Bhavani

Leave a Comment