30.2 C
Hyderabad
May 17, 2024 15: 36 PM
Slider నల్గొండ

మద్యం దుకాణం లో మంటలు

#liquor store

పంట పొలాల మధ్యలో వైన్‌షాప్ ఏర్పాటు చేసారు. ఆ పంట పొలాలకు సంబంధించిన రైతులు వరి పంట కొయ్య కాలుకు నిప్పు అంటించడంతో,ఆ మంటలు విస్తృతంగా వ్యాపించి ఆ వైన్ షాప్ తగలడంతో ఆ వైన్ షాప్ కు సంబంధించిన సిట్టింగ్ రూమ్ తో పాటు వైన్ షాప్ లోని మద్యం దగ్ధమైన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రం శివారులోని లక్ష్మి నరసింహ వైన్ షాప్ కు జరిగింది .

స్థానికులు తెలిపిన ఇలా ఉన్నాయి . గరిడేపల్లి మండల కేంద్రానికి సమీపంలో మిర్యాలగూడ -కోదాడ వెళ్లే ప్రదాన రహదారికి కొంత దూరం లోపలికి లక్ష్మీ నరసింహ వైన్ షాపును పంట పొలాల మధ్య ఏర్పాటు చేశారు. పంట పోలాలకు సంబంధించిన రైతులు కొయ్యకాలుకు (వరి పంట కొయ్యగా మిగిలిన అడుగుభాగం) మంట పెట్టడం జరిగింది.

ఆ మంటలు వీధురు గాలులు తోడవడంతో ఆ మంటలు వేగంగా వ్యాపించుకుంటుా వచ్చి ఆ ప్రక్కనే ఉన్న వైన్ షాపుకు సంబంధించిన పర్మిట్ రూమ్ కోసం వేసిన తాటాకులకు గుడిసెకు ఆ మంటలు అంటుకున్నాయి. అలాగే దాని పక్కనే కిచెన్ రూమ్ కు ఉన్న సిలిండర్ కు మంటలు వ్యాపించడంతో ఆ సిలిండర్ పేలింది.

ఆ సిలిండర్ మండల గాను అందులో ఉన్న 3 ఫ్రిడ్జ్ లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే ఆ వైన్ షాప్ కు కూడా మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న సుమారు నలబై లక్షల నష్టం (ఫర్నిచర్ దగ్ధమైనట్లు,) వచ్చినట్లు సమాచారం. వెంటనే స్థానికులు గుర్తించి ఫైర్ ఇంజన్ ఫోన్ చేయడంతో ఆ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పినట్లు తెలిపారు .

Related posts

గెలిపించిన ప్రజలకు చేసే న్యాయం ఇదేనా?

Satyam NEWS

విశాఖ క్రేన్‌ ప్రమాదంలో పదికి చేరిన మృతుల సంఖ్య

Satyam NEWS

ఘనంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి

Satyam NEWS

Leave a Comment