కోర్టు ధిక్కరణ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్
కోర్టు ధిక్కరణ కేసులో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్కు హైకోర్టు షాకిచ్చింది. రావత్కు హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై వివరణ ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకావాల్సిందిగా గతంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ కోర్టుకు ఆయన హాజరుకాకపోవడంతో న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. కేసు విచారణ జులై 12కు కోర్టు వాయిదా వేసింది. కాంట్రాక్టర్ వెంకటేశ్వర్రెడ్డి వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లో విచారణ సందర్భంగా ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.