26.7 C
Hyderabad
May 12, 2024 10: 46 AM
Slider హైదరాబాద్

సైబరాబాద్ పరిధిలో ఎస్ఐల బదిలీలు

#police

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టారు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ఆయా పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 87 మంది ఎస్సైలకు స్థానచలనం కల్పించారు.

ఇందులో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుగురు ఎస్సైలు బదిలీ కాగా రాయదుర్గం నుండి ఇద్దరు, గచ్చిబౌలి నుండి ముగ్గురు, ఆర్‌సీ పురం నుండి ముగ్గురు, కూకట్ పల్లి నుండి నలుగురు, ఐటీ కారిడార్ నుండి ఒకరు జీడిమెట్ల నుండి నలుగురు, సనత్ నగర్ నుండి ఇద్దరు, జగద్గిరిగుట్ట నుండి ఇద్దరు, పేట్ బషీరాబాద్ నుండి ఇద్దరు, షామీర్ పేట్ నుండి ఇద్దరు, సీసీఎస్ బాలానాగర్ నుండి ఒకరు బదిలీ అయ్యారు.

ఒక్కొక్కరు, శంషాబాద్ నుండి ఇద్దరు, ఆర్‌జీఐ నుండి ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఇతర పోలీస్ స్టేషన్లకు బదిలీ అయ్యారు. కొత్తూరు నుండి ఇద్దరు, కొత్తూరు నుండి ఒకరు, సీసీఎస్ మాదాపూర్ నుండి ఒకరు, ఆమన్ గల్ ఒకరు, రాజేంద్రనగర్ నుండి ఇద్దరు, మైలార్ దేవులపల్లి నుండి ముగ్గురు, నార్సింగి, మొయినాబాద్ పీఎస్‌లకు చెందిన ఒక్కొక్క ఎస్సై ట్రాన్స్ఫర్ అయ్యారు.

సీసీఎస్ బాలానగర్ ఇద్దరు, సీసీఎస్ మాదాపూర్ ఒకరు, సీసీఎస్ శంషాబాద్‌కు చెందిన నలుగురు ఎస్సైలు, కూకట్ పల్లికి చెందిన ఎస్సై ఒకరు, మాదాపూర్, మియాపూర్, షాద్ నగర్, రాజేంద్రనగర్, ఆర్ జీఐఏ ట్రాఫిక్ ఎస్సైలు, ఎస్ ఓటీ, సైబర్ క్రైమ్ ఎస్సైలను కూడా బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని, ఎస్సైలకు నూతనంగా కేటాయించిన నూతన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related posts

Russia Ukraine war: చర్చలకు సిద్ధంగా లేమని చెప్పలేదు

Satyam NEWS

సిరెంజిల కొరత ముప్పు ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Sub Editor

చీరాల టిడిపి టిక్కెట్ నాదే: కొండయ్య స్పష్టీకరణ

Satyam NEWS

Leave a Comment