హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను విజయవంతం చేయాలని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోజిల్లా కాంగ్రెస్ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్రకు వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో జనవరి 26 నుండి మార్చి 26 వరకు చేయి చేయి కలుపుదాం ఐక్యత చాటుదాం పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. భారత్ జోడోయాత్రకు వస్తున్న స్పందన చూసి బిజెపి ఆర్ఎస్ఎస్ కు కంటిమీద కునుకు లేకుండా పోయిందని అన్నారు. బిజెపి ప్రభుత్వ విద్వేషపూరిత కుట్రను శాంతి మార్గంలో తిప్పి కొడుతున్న రాహుల్ గాంధీని కొనియాడారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో అన్ని మండల కేంద్రాలలో జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.