36.2 C
Hyderabad
May 7, 2024 14: 27 PM
Slider ప్రత్యేకం

దొంగనోట్ల కేసులో వైసీపీ మహిళానేత అరెస్టు

#ycpleader

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకురాలు రసపుత్ర రజని దొంగనోట్ల కేసులో అరెస్టు అయ్యారు. రసపుత్ర రజని ఆంధ్రప్రదేశ్ బొందిలి కార్పోరేషన్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆమె కడప జిల్లాకు చెందిన వైసీపీ మహిళా నేత. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డికి ఆమె అత్యంత సన్నిహితంగా ఉంటారని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. దొంగనోట్ల కేసులో రసపుత్ర రజిని కర్ణాటకలో పట్టుబడటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం కలిగించింది. సుబ్రమణ్యపుర పోలీసులు రసపుత్ర రజనితో బాటు చరణ్ సింగ్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.500 నోట్లు మొత్తం 818 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగ నోట్లకు సంబంధించి మరింకెంత మంది ఉన్నారనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

సమాజంలోని దివ్యాంగులను ప్రతి ఒక్కరు ఆదుకోవాలి

Satyam NEWS

పౌరసత్వ చట్టం వివక్షపూరితమైనదే

Satyam NEWS

Leave a Comment