రంగారెడ్డి జిల్లా చంపాపేట్ విద్యుత్ కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బైరామల్ గూడా అసిస్టెంట్ ఇంజనీర్ టి ఆర్ ప్రసాద్, చంపాపేట్ డివిజినల్ ఇంజనీర్ విజయ భాస్కర్ రెడ్డి, చంపాపేట్ అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ కృష్ణయ్య తదితరులు జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతే కాకుండా విద్యుత్ సంస్థ సిబ్బంది మొత్తం ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.