దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వారు తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయించిన ఘనత సి ఏం కె సీ ఆర్ కే దక్కుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అన్నారు.
ఉప్పల్ ముదిరాజ్ భవన నిర్మాణానికి గురువారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఉప్పల్ డివిజన్ లోని శాంతినగర్ నుండి సాయి రామ్ నగర్ కాలనీ వరకు గల బైపాస్ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ తో కలిసి పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈ నాగేందర్, ఉప్పల్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మస్కా సుధాకర్, యువజన అధ్యక్షులు అరటికాయల వంశీ ముదిరాజ్, స్వీట్ హౌస్ రాజు ముదిరాజ్, టిఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, చింతల నరసింహా రెడ్డి, పంగ మహేందర్ రెడ్డి, నంది కంటి శివ, సాయిరాజ్ రెడ్డి, భరత్ రెడ్డి, ఉప్పల్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు అనిత రెడ్డి, జరీనా బేగం, ముదిరాజ్ సంఘం నాయకులు మహంకాళి వేణు, బోరంపేట రవి, తలారి జంగీర్, బోరంపేట కృష్ణ, ఈగ పండు, ఈగ అంజయ్య, ఈగ లక్ష్మణ్, బోరంపేట జయకృష్ణ, ఈగ సంతోష్, కంచెమీద శివయ్య, తలరి ధనయ్యా, పీటల సాయిలు, తీగ విట్టల్, బోరంపేట మురళి,ఈగ బాబు, ఈగ రామ్, బోరంపేట రామ్, రంగుల శేఖర్, తలరి వినయ్, తలరి పండు, తలారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.